calender_icon.png 5 October, 2024 | 12:54 AM

ఈదులగట్టెపల్లిలో విషాదం.. బాలుడి సజీవ దహనం

04-10-2024 09:43:28 PM

ప్రమాదవశాత్తు  ఇంట్లో షార్ట్ సర్క్యూట్

ఏడేళ్ల  బాలుడి సజీవ దహనం

మానకొండూర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల పరిధిలోని ఈదుల గట్టెపల్లి గ్రామంలో ప్రమాదవశత్తు  ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో  అంగిడి సాయి కుమార్(7) బాలుడు సజీవ దహనం అయినట్లు శుక్రవారం గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈదుగల గట్టేపల్లి గ్రామానికి చెందిన అంగిడి అనిత -రాజ్ కుమార్ దంపతులకు రికిత (10), సాయికుమార్ (7) ఇద్దరు పిల్లలు. కాగా శుక్రవారం సాయంత్రం  ప్రమాదవశత్తు ఇంటి ఆవరణలో విద్యుత్ వైర్లు తెగి ఇంటి ఎదుట ఉన్న పందిరి, ఇంట్లో భద్రపరచుకున్న  ప్లాస్టిక్  పరదలకు మంటలు అంటుకున్నాయి. ఇంట్లో  పర రదల పక్కనే నిద్రిస్తున్న సాయి కుమార్ కు మంటలు అంటుకొని కేకలు వేశాడు, ఇంటి ఆవరణ ఉన్న తల్లిదండ్రులు  ఇంట్లో నుండి వస్తున్న మంటలను చూసి కేకలు వెయ్యగా చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు వచ్చి తలుపులను ధ్వంసం చేసి బాలుడ్ని కాపాడే  ప్రయత్నం చేసినప్పటికీ మంటల్లో పూర్తిగా దగ్దమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 వాహన సిబ్బంది  ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ బాలుడు   సజీవ దహనమై మృతి చెందినట్లు తెలిపారు. పూర్తిగా దగ్ధమైన మృతదేహాన్ని ఇంట్లో నుండి బయటికి తీశారు కొడుకు మృతితో  తల్లిదండ్రుల  రోదన  పలువురుని కంటతడి పెట్టించాయి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు మానకొండూరు సిఐ ఇన్చార్జ్ స్వామి తెలిపారు.