calender_icon.png 24 September, 2024 | 2:45 PM

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి యువకుడు మృతి

24-09-2024 12:24:38 PM

లక్షెటిపేట,(విజయక్రాంతి): మండలంలోని ఆర్ఎంపీ వైద్యం వికటించిన యువుకుడు మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... లక్షెటిపేట మండలం కొత్త కొమ్ముగూడెంకు చెందిన భత్తుల మధుకర్ (20)కు సెప్టెంబర్ 18న నీరసంగా ఉండడంతో స్థానిక ఆర్‌ఎంపీ బొడ్డు శ్రీనివాస్ ను పిలవగా ఇంటికి వచ్చి ఇతడికి సెలైన్స్ ఎక్కించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు సరే అని అంగికరించారు.

సెలైన్ లో  ఇంజక్షన్‌ ఇవ్వడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత చలి రావడంతో ఆర్ఎంపి వద్దకు అతని సోదరుడు వెళ్లి చెప్పగా మధుకర్ పరిస్థితి సీరియస్ ఉందని అతడు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలపడంతో ఎమ్మారై చేయించగా స్థానికంగా ఎవరితోనైనా వైద్యం చేయించారని డాక్టర్ అడగగా అవును చేయించామని చెప్పడం జరిగింది.

దీంతో డాక్టర్ ఆర్ఎంపి చేసిన వైద్యం వల్లనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కు గురైందన్నారు. అక్కడి నుంచి కరీంనగర్ మెడికవర్ ప్రైవేట్‌ ఆసుపత్రి డాక్టర్‌ను సంప్రదించగా ఇన్‌ఫెక్షన్‌ సోకిందన్నారు. దీంతో వెంటనే హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించమని చెప్పడం తో అక్కడినుండి హైదరాబాదుకు తరలించి మూడు రోజులు గడిస్తే గాని చెప్పమని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆర్‌ఎంపీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎస్సై సత్తీష్ తెలిపారు.