calender_icon.png 6 October, 2024 | 5:58 PM

పేద విద్యార్థులకు దసరా కానుక: మంత్రి కోమటిరెడ్డి

06-10-2024 03:32:49 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పేద విద్యార్థులకు దసరా కానుకను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. విద్యార్థులకు దసరా కానుకగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు అందజేస్తామని మంత్రి కోమటి రెడ్డి పేర్కొన్నారు.  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అందరికీ శుభవార్త అని, మంచి చేస్తుంటే ప్రతిపక్షాలకు కనిపించట్లేదని మంత్రి విరుచుకుపడ్డారు.