కల్వచర్ల: పెద్దపల్లి జిల్లాలో లూపస్ వ్యాధితో ఓ యువతి అకాల మరణం చెందింది. రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన కట్ట సత్యనారాయణ కూతురు సాహితి లూపస్ అనే వ్యాధితో బాధపడుతుంది. దీంతో ఆమెకు హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 7 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందింది. సాహితి మృతితో ఉరిలో విషాదచాయలు అలుముకున్నాయి. మాజీ జడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించారు.