calender_icon.png 28 March, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరు ఇంకిపోయిందని యువరైతు ఆత్మ హత్యాయత్నం

25-03-2025 01:39:04 PM

పెబ్బేరు: వనపర్తి జిల్లా పబ్బేరు మండల పరిధిలోని అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన యువరైతు కురుకుంట్ల శ్రీకాంత్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేశారు. యువరైతు శ్రీకాంత్ కు స్థానికంగా 15 ఎకరాల భూమి ఉంది. అందులో బోరు వేసి 6 ఎకరాలలో బత్తాయి తోట సాగుచేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం తన వ్యవసాయ భూమికి ప్రక్కనే ఉన్న స్థానిక రైతు జంపుల్ బుచ్చారెడ్డి పొలంలో బోరు వేశాడు. ఆయన బోరు వేయటంతో శ్రీకాంత్ బోరు ఇంకిపోయి బత్తాయి తోటకు నీరు అందకపోవటంతో తీవ్ర ఆందోళన చెందారు.

ఇవాళ తెల్లవారుజామున సెల్ఫీ వీడియో తీసుకుని స్థానిక వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేసిన అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. హుటాహుటిన పెబ్బేరుకు తరలించారు. స్థానికంగా ఉన్న మూడు ఆసుపత్రుల్లో ప్రయత్నం చేయగా వారు కర్నూలుకు రెఫర్ చేశారు. అంబులెన్స్ లో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. గత పది సంవత్సరాల క్రితం చార్టెడ్ అకౌంట్ చదువు పూర్తి చేసి ఉద్యోగం వైపు వెళ్లకుండా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలవటంతో గ్రామంలో శ్రీకాంత్ యువతకు ఆదర్శంగా నిలిచారు. త్వరగా కోలుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.