- డబ్బులు ఇస్తేనే డెలివరీ లేకుంటే రిఫర్ టు సంగారెడ్డి
- కొడుకు పుడితే రూ.5 వేలు
- బిడ్డ పుడితే ౩వేలు ఇవ్వాల్సిందే
- పట్టించుకోని ప్రభుత్వ అధికారులు
- ఇబ్బందుల్లో రోగులు
కొండాపూర్ ఫిబ్రవరి 5 : కొండాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ కావాలి అంటే కంపల్సరి డబ్బులు ఇవ్వాల్సిందని డెలివరీ వచ్చిన వారి దగ్గర నుండి అక్రమంగా రూ. 3వేలు వసూళ్లు చేసిన సిస్టర్స్అటెండర్స్ వారిపైన చర్య తీసుకోవాలని బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న మెడికల్ ఆఫీసర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి మాట్లా డుతూ కొండాపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వఆసుపత్రిలో గత మూడు రోజులక్రితం డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డెలివరీ అయిన తర్వాత సిస్టర్స్మరియుఅటెండర్స్ మాకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే వాళ్ల దగ్గర ఉన్న 2500 రూపాయలు ఇస్తే మాకు 2500 రూపాయలు మాకు వద్దు అనడంతో వాళ్లు మళ్లీ ఇంటికి పోయి మళ్లీ డబ్బులు తెచ్చి 3000 రూపాయలు ఇస్తేనే తప్ప బేబీని ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.
ఇలాంటి పరిస్థితి కొండాపూర్ మండల కేంద్రంలో ఏర్పడ్డదని అన్నారు. అక్రమంగా రోగులనుండి డబ్బులు వసూలు చేస్తున్న సిస్టర్స్ పైన చర్య తీసుకోకుండా నిర్లక్ష్యంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. పేద ప్రజల నుండి అక్రమంగా బెదిరించిడబ్బులు వసూళ్లు చేసిన సిస్టర్ల, అటెండర్లని ఉద్యోగం నుంచి తొలగిం చాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
కొడుకు పుడితే 5000 రూపా యలు బిడ్డే కొడితే 3000 రూపాయలు ఇవ్వాల్సిందని సిస్టర్స్ కొండాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ లో డిమాండ్ చేస్తున్న అయినా జిల్లా అధికారులు వాళ్లపైన చర్యలు తీసుకో కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇలా డబ్బులు పేదల నుండి వసూళ్లు చేస్తున్న సిస్టర్స్ పైన చట్టపైన మన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాట నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే రాజయ్య సీఐటీయూ మండల కార్యదర్శి బాబురావు సిపిఎం పార్టీ నాయకులు అర్జున్,అనిల్, శివ తదితరులు పాల్గొన్నారు.