calender_icon.png 1 October, 2024 | 10:59 PM

మీరు ఆరోగ్యంగా ఉండాలి

01-10-2024 12:32:41 AM

2047 నాటి వికసిత్ భారత్‌ను కళ్లారా చూడాలి

ఖర్గే ప్రసంగంపై కేంద్రమంత్రి అమిత్ షా సెటైర్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: జమ్మూకశ్మీర్ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. ఆదివారం నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టటీ జాతీయ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య మరింత వేడిని పెంచాయి.

ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేంత వరకు తాను చనిపోనని.. ఆయన ఓటమిని కల్లారా చూస్తానని ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఖర్గే ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ పట్ల కాంగ్రెస్‌కు ఉన్న ద్వేషం, భయం స్పష్టంగా తెలుస్తోంది. ఆయన తన ప్రసంగంతో కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ మించిపోయారు అని షా అన్నారు.

మోదీని అధికారం నుంచి తొలగించిన తర్వాతనే తాను చనిపోతానని చెప్పి అనవసరంగా ఆయన వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోకి ప్రధాని మోదీని లాగారు’ అని వ్యాఖ్యానించారు. ఖర్గేజీ మరు ఆరోగ్యంగా ఉండాలని, ప్రధాని మోదీ, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్‌ను మీరు కళ్లారా చూడాలి కోరుకుంటున్నట్లు అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.