calender_icon.png 4 October, 2024 | 4:51 AM

పదకొండేళ్లుగా పదోన్నతుల్లేవ్!

04-10-2024 01:03:44 AM

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో పనిచేస్తున్న మాడ ల్ స్కూల్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మాడల్ స్కూ ల్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను అసోసియేషన్ నాయకులు భూతం యాకమల్లు, కే నగేశ్, రాజుకుమార్, రవీందర్‌గౌడ్ కలిసి వినతిపత్రం అం దజేశారు.

తాము ఉద్యోగాలు పొంది పదకొండేళ్లవుతోందని, అప్పటి నుం చి పదోన్నతులు లేకుండా ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్నామని వివరించారు. వెంటనే మాడల్ టీచర్లకు పదోన్నతు లు కల్పించి, 010 పద్దు ద్వారా వేతనాలు, కారుణ్య నియామకాలు చేప ట్టాలని కోరారు.