విపత్తు వేళ వయనాడ్ ప్రజల
తెగువ ఆదర్శనీయం
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ
వయనాడ్, అక్టోబర్ 26: విపత్తు సమయంలో వయనాడ్ ప్రజలు చూపించిన ధైర్య సాహసాలు తనలో స్ఫూర్తిని నింపాయని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంకగాంధీ అన్నారు. ఎన్నికల ప్రచార ంలో భాగంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి ఎక్స్లో ఆమె లెటర్ను పోస్ట్ చేశారు. ప్రకృతి విపత్తుతో విలవిలలాడిన ప్రాంతాల్లో రాహుల్తో కలిసి పర్యటించినపుడు మీరు ఎదు ర్కొన్న కష్టాలను, నష్టాన్ని, మీ ఆవేదననను ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నారు. దయనీయ చీకటి పరిస్థితుల నుంచి బయటపడి కొత్త జీవితంలోకి ముందుకు వెళ్లిన మీ ఆలోచన తనలో స్ఫూర్తిని నింపిందన్నారు. అలాగే అసహాయ స్థితిలో ఉన్న తోటివారి కోసం మీరు పడిన ఆరాటం తన లో ధైర్యాన్ని నూరిపోసిందని వివరించారు. కష్ట సమయంలో మీరు చూపించిన తెగువ, ధైర్య సాహసాలు తనకు స్ఫూర్తిని ఇచ్చాయని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే ఇక్కడ పోటీ చేస్తున్నానని చెప్పారు.