calender_icon.png 23 September, 2024 | 8:07 PM

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

23-09-2024 05:22:23 PM

పంచాయతీరాజ్ మంత్రి సీతక్కను కోరిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

కామారెడ్డి, (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా మారుమూల నియోజకవర్గమైన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోమవారం సచివాలయంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు. 24 4 కోట్ల రూపాల నిధులను మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాలు నూతన గ్రామపంచాయతీ భవనాలు మరమ్మత్తులు పంచాయతీరాజ్ రోడ్లు వందనాలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు మంత్రికి అందించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉన్నాయని కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు మంత్రికి. గతంలో పరిపాలన చేసిన ఎమ్మెల్యేలు గిరిజన తండాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని ఎమ్మెల్యే మంత్రికి వివరించి వెంటనే నిధులు మంజూరు చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలను ఆదుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల ఎమ్మెల్యే మదన్మోహన్రావు హర్షం వ్యక్తం చేశారు.