calender_icon.png 29 September, 2024 | 6:57 AM

యథా రాజ.. తథా ప్రజా

29-09-2024 02:44:49 AM

హైడ్రా చర్యల నేపథ్యంలో కొందరు సామాన్య ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఇండ్లు కోల్పోయి న మహిళలు మాట్లాడుతున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

ప్రజలు అలాంటి మాటలను బహిరంగంగా మాట్లాడేలా ప్రోత్సహించే నాయకుల తీరుపైనా చర్చ జరుగుతున్నది. పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ పోటీ పడి మరీ ప్రజలకు తిట్ల పురాణాన్ని వినిపించిన వారే. యథా రాజా తథా ప్రజా అన్నట్టు తిట్ల విషయంలో రాజకీయ నాయకుల బాటలోనే సాధారణ ప్రజానీకం నడుస్తున్నారు.-----------