జగన్ చేయి పట్టకున్నోళ్లంగా పాతాళంలోకే
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి, చెల్లిపై కేసులేయడంతో జగన్ పాతాళానికి కూరకుపోయారని యనమల పేర్కొన్నారు. జగన్ చేయి పట్టకున్నోళ్లంతా పాతాళంలోకేననన్నారు. ఆస్తుల వివాదం కాదు.. ఇది రాజకీయ ఆత్మహత్యలేనని తెలిపారు. చివరికి జగన్ సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని యనమల ఆరోపించారు. రష్మిలకు ఇచ్చిన రూ. 200 కోట్లు జగన్ కు ఎక్కడివి?, రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా.. ఐటీ, ఈడీ స్పందించట్లేదు..?, ఒక ఆర్థిక నేరస్థుడు 11 ఏళ్లుగా బెయిల్ పై ఉండటమేంటి..? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే అనేకమంది వైసీపీని వీడుతున్నారని రామకృష్ణుడు సూచించారు. భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలేనని చమక్కరించారు. ఇవాళా కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. పాత కేసులకు తోడు కొత్త కేసులు ఆయనపై సిద్ధంగా ఉన్నాయని యజమల జోస్యం చెప్పారు.