calender_icon.png 21 September, 2024 | 8:15 AM

యాదాద్రిలో తప్పిన ప్రమాదం.. విద్యార్థులు క్షేమం

19-07-2024 10:15:14 AM

వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లిలో ఓ స్కూల్ వ్యాను రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. స్టీరింగ్ రాడ్ విరగడంతో స్కూలు వ్యాను రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. స్కూలు వ్యానును మోత్కూరుకు చెందిన సెయింట్ ఆన్స్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.