calender_icon.png 9 October, 2024 | 1:53 PM

అస్సాంలో యాబా డ్రగ్స్ కలకలం

09-10-2024 01:11:37 AM

అస్సోం, అక్టోబర్ 8: ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన అస్సాంలో తరుచూ డ్రగ్స్ పట్టుబడుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ యేడాది జూలై, అక్టోబర్ నెలల్లోనూ దాదాపు రూ.33 కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. తాజాగా బదర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కరీంగంజ్ ఏఎస్పీ ప్రతాప్ దాస్, అస్సాం రైఫిల్స్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి కరీంగంజ్ జిల్లాలో రూ.కోటి విలువ చేసే దాదాపు 10వేల డ్రగ్స్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కటిగోరా ప్రాంతానికి చెందిన డ్రగ్ పెడ్లర్ దిల్వార్ హుస్సేన్ చౌదరి (23)ని అరెస్టు చేశారు.  పట్టుబడిన యాబా డ్రగ్స్ విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుందని అంచనా.