మెదక్ (విజయక్రాంతి): కౌడిపల్లి మండల కేంద్రంలో శాశ్వతంగా డిగ్రీ కళాశాల భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. కౌడిపల్లిలో జూనియర్ కళాశాల భవనంలోనే డిగ్రీ కళాశాలను షిఫ్ట్ పద్ధతిలో నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చే విద్యార్థులకు ఆర్థిక భారం ఏర్పడుతుందని వాపోయారు. ఇక్కడ శాశ్వతంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో గురువారం నాడు నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట రహదారిపై విద్యార్థులు రాస్తారోకో ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక నాయకులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చ చెప్పడంతో రాస్తారోకో విరమించారు.