calender_icon.png 27 October, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌కే పరిమితం ప్రపంచ స్కాష్ టోర్నీ

22-07-2024 11:53:13 PM

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ స్కాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. బాలుర, బాలికల విభాగాల్లో మన ఆటగాళ్లు క్వార్టర్స్‌లో పరాజయాలు చవిచూశారు. బాలుర విభాగం క్వార్టర్స్‌లో భారత్ 1 తేడాతో దక్షిణకొరియా చేతిలో ఓటమి చవిచూసింది. తొలి గేమ్ యువరాజ్ గెలిచినప్పటికి శౌర్య, అరిహంత్‌లు పరాజయం పాలవ్వడంతో భారత్ పోరాటం ముగిసింది. బాలికల విభాగంలో షమీనా, అనహత్, నిరూపమ త్రయం 1 మలేషియా చేతిలో పరాజయం పాలైంది.