calender_icon.png 30 September, 2024 | 9:54 AM

హైదరాబాద్‌లో వరల్డ్ గోల్ఫ్ టోర్నీ

30-09-2024 02:03:34 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 29(విజయక్రాం తి): 2025 ఫిబ్రవరిలో హైదరాబాద్ నగరంలో వరల్డ్ గోల్ఫ్ టోర్నీని నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి.. టోర్నీ విజేతగా నిలిచిన శంకర్‌దాస్‌కు ట్రోఫీ తో పాటు ప్రైజ్‌మనీ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ..

గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్ షిప్‌ను అంతర్జాతీయ టోర్నీగా నిర్వహించేదుకు కృషిచేస్తామన్నారు. హైదరాబాద్‌ను ఏషియన్‌ను ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ సర్క్యూట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో భారతి గోల్ఫ్ సీఈఓ మానవి జైనీ, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్షుడు బీవీకే రాజు, డీఎస్‌ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.