04-03-2025 02:05:10 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (విజయక్రాంతి): న్యాక్ గుర్తింపు కోసం జరిగే ప్రక్రియకు అధ్యాపకులను సన్నధం చేయడంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల వర్క్షాప్ను సోమవారం ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొ. కుమార్ మొలుగరంతో కలిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ . బాలకిష్టారెడ్డి ప్రారంభించారు. ఆ సందర్భంగా హాజరైన 13వందలకు పైగా అధ్యాపకులను ఉద్దేశించి బాలకిష్టారెడ్డి మాట్లాడారు.