రోడ్లు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్, జూలై 21: ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. కొత్తపేట డివిజన్ ఆర్టీసీ కాలనీలో సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం భవనంతో పాటు కాలనీలో చేపట్టిన నూతన డ్రైనేజీ పైపులైన్ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అంది స్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్, మన్సూ రాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, ఆర్టీసీ కాలనీ సంఘం అధ్యక్షుడు పెంటారెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు యో గేందర్రెడ్డి, నాయకులు సాంబయ్యగౌడ్, శివాచారి, కిరణ్గౌడ్ పాల్గొన్నారు.