calender_icon.png 29 September, 2024 | 2:57 AM

‘ఓదెల ఆలయ అభివృద్ధికి కృషి’

29-09-2024 12:43:52 AM

పెద్దపల్లి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): జిల్లాలోని ఓదెల మల్లిఖా ర్జున స్వామి దేవస్థానం గురించి సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లి  దృష్టికి తీసుకె ళ్లి అభివృద్ధికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం ఆయ న దేవస్థానంలో మదనపు పోచమ్మ ఆలయం చుట్టూ దాతల సహకారంతో ప్రహరీ నిర్మాణానికి శంకు స్థాన చేశారు. ఆలయం మీదుగా రూ.16 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మిస్తామన్నారు. దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ పాల్గొన్నారు.