ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
మంంథని, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): సింగరేణి కార్మికులు ఎవరు అధైర్య పడొద్దు. మీ కుటుంబాలకు అండగా నేను న్నా అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్ జి-1 జిఎం లలిత్ కుమార్కు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సూచిం చారు.
రామగుండం జీడీకే ఓసి-5 లో గత రెండు రోజుల క్రితం క్యాంటీన్ విషయమై తలెత్తిన సమస్యపై ఎమ్మెల్యే కు మరియు సిఎండికి ఫిర్యాదు చేసిన లెటర్లో స్థానిక కార్మికులు సంతకాలు చేసినందుకు అధికా రులు కార్మికులకు నోటీసులు జారీ చేశారు.
మీరు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఫిర్యాదు చేస్తారా... అంటూ నాయకులను, పలువురు కార్మికులపై చర్యలు తీసుకుంటామని గని మేనేజ్మెంట్ బెదిరింపులకు పాల్పడుతుం దని ఆదివారం ఐఎన్టియుసి నాయకులు జనగామ శ్రీనివాస్ గౌడ్, మరియు అరగంటి కష్ణ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను కలిసి వినతి పత్రం ఇస్తూ వారి సమస్యని తెలియ జేశారు.
హైదరాబాద్ లో వారు ఎమ్మెల్యే దష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఆర్జీ-1 జిఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిం చాలని సూచించారు. కార్మికుల ఆందోళనకు గురి కావలసిన అవసరం లేదని కార్మికులకు ఇచ్చిన నోటీసులు వెంటనే రద్దు చేయాలని గని మేనేజ్మెంట్ను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.