calender_icon.png 25 September, 2024 | 2:09 PM

మన్ననలు పొందేలా పనిచేయాలి

25-09-2024 01:22:04 AM

ఎమ్మెల్యే  విజయరమణరావు

పెద్దపల్లి, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): పెద్దపల్లి రైతుల మన్ననలు పొందేలా నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం పనిచేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. మంగళవారం నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ కూర మల్లరెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే నియామక పత్రాలను అంద జేసి, శుభాకాంక్షలు తెలిపారు.