ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్
ఆదిలాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): గిరిజనుల సంక్షేమానికి తెలంగా ణ ప్రభుతం పెద్దపీట వేస్తున్నదని గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ(ట్రైకార్) చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అన్నారు. అదిలాబాద్ జి ల్లా ఇంద్రవెల్లి, ఉట్నూర్లలో సోమవారం ఆయన పర్యటించారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్లో మీడియా సమావేశంలో ఐటీడీఏ ప్రా జెక్టు అధికారి ఖుష్బూగుప్తా, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు.
గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అరులైన లబ్ధిదారులకు చేరవేయాల ని సూచించారు. అంతకుముందు గుడిహత్నూర్ మండలంలోని పునగూడ గ్రామం లో ఆయిల్మి ల్ను సందరిం చి, పలు మిషిన ్లను ప్రారంభించారు.
ఆయన వెంట ఎమెల్యే లు వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ట్రైకార్ జనరల్ మేనేజర్ శంకర్రావు, లక్ష్మిప్రసాద్, జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ఉన్నారు. నిర్మల్లో బెల్లయ్యనాయక్ను లంబాడ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్ పాపవత్, అశోక్ జాదవ్, సురేష్, శ్రీనివాస్, అంబాజీ, రోహిదాస్, మో హన్, జగదీష్నాయక్ పాల్గొన్నారు.