మల్కాజిగిరి ఎంపీ ఈటల
ఎల్బీనగర్, ఆగస్టు 11: అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నాగోల్ డివిజన్లోని సాయినగర్కాలనీలో నిర్మిం చిన కమ్యూనిటీ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాగోల్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చింతల అరు ణ, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, బీజేపీ నేత సురేందర్యాదవ్ పాల్గొన్నారు.