calender_icon.png 13 March, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్త్రీనిధి రుణాలను వంద శాతం రికవరీ చేయాలి

12-03-2025 10:47:25 PM

జిల్లా అదనపు కలెక్టర్  దీపక్ తివారి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): మహిళా సంఘాల అభివృద్ధిలో భాగంగా అందించే స్త్రీ నిధి రుణాలను వంద శాతం రికవరీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి(Additional Collector Deepak Tiwari) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు కలిసి ఎపిఎం, సిసిలు మెప్మాా సిబ్బందితో స్త్రీ నిధి రుణాల రికవరీ, నూతన రుణాలు జారీ, ప్రమాద బీమా, బ్యాంకు లింకేజీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెలాఖరుకల్లా స్త్రీ నిధి రుణాల రికవరీ, ఓవర్ డ్యూస్ రికవరీ వంద శాతం పూర్తి చేసే విధంగా అధికారులు మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కువ స్త్రీ నిధి రుణాల బకాయి కలిగిన సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి సంఘాల మనుగడపై వివరించాలని, వంద శాతం రుణాలను తిరిగి చెల్లించిన సంఘాలకు నూతన రుణాలు అందించాలని తెలిపారు. సంఘాలలో సభ్యులు ప్రతి ఒక్కరు ప్రమాద బీమాకు ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు 100 శాతం బ్యాంకు లింకేజీలు పూర్తి చేయాలని తెలిపారు. ఈ అంశాల నిర్వహణకు కార్యచరణ రూపొందించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇది నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మండలాల వారీగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, మెప్మా ప్రాజెక్టు అధికారి మోతిరామ్, సంబంధిత అధికారులు, స్త్రీ నిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.