calender_icon.png 13 March, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

07-03-2025 05:54:45 PM

ప్రముఖ సంఘసంస్కర్త అయిత పరంజ్యోతి

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంఘసంస్కర్త అయిత పరంజ్యోతి మహిళలందరికీ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అయిత పరంజ్యోతి మాట్లాడుతూ... మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కాబట్టి మహిళలు చదువుకున్నప్పుడే దేశాభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ, మహిళా ఉపాధ్యాయులు రాధా, రమా, రమాదేవి, సరస్వతి, శ్రీవాణి, రేఖ,  ఉమా విజయలత, ఏపీఓ శ్వేతా, ఏపీఎం లక్ష్మి నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.