calender_icon.png 23 October, 2024 | 11:28 PM

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

12-08-2024 01:12:46 PM

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని నాలుగవ వార్డులో గత కొన్ని రోజులుగా త్రాగునీడు రావడంలేదని సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి ఎమ్మార్వో ఛాంబర్ లో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. త్రాగునీరు పైపులైన్లను మరమ్మత్తులు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసిల్దార్ కాటమయ్యకు సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కోట రామస్వామి, మహిళలు త్రివేణి, నాగమ్మ, సోమలక్ష్మి, నాగమ్మ, వెంకన్న, రామగిరి వెంకన్న, రజిత తదితరులు పాల్గొన్నారు.