29-03-2025 08:47:59 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నారీమణులు శక్తిమంతురాళ్ళు అని, ప్రతి ఒక్కరు నిరూపించాలని మహిళా కానిస్టేబుళ్లు శ్రావణి, మల్లేశ్వరిలు అన్నారు. ఈ మేరకు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నారీ శక్తి మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ మేరకు వారు శనివారం మండలంలోని మస్కాపూర్ కేజీబీవీ పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో, అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థినిలు చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలతో ముందుకు సాగాలని అన్నారు. అనంతరం పట్టణ కూడలిలో వాహనాల తనిఖీ చేపట్టారు.