హైదరాబాద్: కూకట్ పల్లిలో గత నెల 30న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియాంక హత్య కేసును కూకట్ పల్లి పోలీసులు చేధించారు. మంజుల అనే మహిళ ప్రియాంకను హత్య చేయించినట్లు పోలీసులు నిర్ణారించారు. వెండి నగల విషయంలో ప్రియాకం, మజుల మధ్య వివాదం జరిగింది. దీంతో పగ పెంచుకున్న మంజుల మద్యం తాగించి ప్రియాంక గొంతు కోసి హత్య చేసింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అత్యాచారంగా చిత్రీకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలి నుంచి వెండి ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు.