హైదరాబాద్ : సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవ, అన్నదమ్ముల ఆస్తి పంపకాలు, ఆత్తకోడళ్ల పంచాయితీలను చూస్తుంటాము. కానీ హైదరాబాద్ లో ఓ ఛాయ్ పంచాయితీలో కోడలి ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్ లోని హసన్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ అత్త కోడలికి ఛాయ్ పంచాయితీ జరిగింది. గురువారం ఉదయం అత్త ఫర్జాన కోడలు అజ్మీర బేగంని చాయ్ పెట్టియమని అడిగింది. అందుకు కోడలు నిరాకరించింది. దీంతో కోపగించిన అత్త, చున్నీని కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్త ఫర్జానను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.