16-03-2025 08:13:49 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన కొత్త శ్యామల అనే మహిళ ఇంట్లో ఆదివారం ఒంటరిగా ఉండటం గమనించి ఒక మహిళ ఆమె ఇంట్లోకి చొరబడి మెడలోని సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పరార్ అయ్యిందని ఎస్ఐ సతీష్ తెలిపారు. బాధితురాలు కొత్త శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చెసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.