calender_icon.png 4 October, 2024 | 2:25 PM

మంత్రాలు చేస్తుందన్న నెపంతో మహిళ సజీవదహనం

04-10-2024 11:44:56 AM

మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో గ్రామానికి చెందిన రాగల ముత్తవ్వ (50 ) అనే మహిళను కొంతమంది వ్యక్తులు విచక్షణ రహితంగా కొట్టి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణంగా హత్య చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రామాయంపేట పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్లి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనకు బాధ్యులుగా అనుమానించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.