calender_icon.png 21 September, 2024 | 2:58 AM

పిడుగుపాటుకు మహిళ మృతి

21-09-2024 12:56:40 AM

బెల్లంపల్లి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చులాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి గోలెం పోషక్క(55) మృతి చెందింది. పొలం పనులు ముగించుకుని, సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వర్షం కురిసి, పిడుగు పడటంతో పోషక్క అక్కడికక్కడే మృతి చెందింది.