calender_icon.png 19 October, 2024 | 2:54 PM

ట్రాక్టర్ బోల్తా పడి మహిళ మృతి

19-10-2024 12:51:57 PM

కౌడిపల్లి: ట్రాక్టర్ బోల్తా పడడంతో మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకుట్లపల్లి రోడ్డుపై శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటాపూర్ (బి) గ్రామానికి చెందిన పొడిగంటి సాయమ్మ (45) మృతి చెందింది. ట్రాక్టర్ లో డస్ట్ నింపుకొని వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా కొట్టినట్టు కౌడిపల్లి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.