మెదక్ జిల్లాలో దారుణం
మెదక్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మంత్రాలు చేస్తుందన్న నెపంతో ఓ మహిళను దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన అమానవీయ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో నివాసం ఉండే ర్యాగల ముత్తవ్వ (50) మం త్రాలు చేస్తుందనే నెపంతో గురువారం రాత్రి కొంతమంది విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశారు.
తీవ్రంగా గాయపడ్డ ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ విష యం స్థానికుల ద్వారా తెలుసుకున్న సీఐ వెంకట రాజాగౌడ్, ఎస్సై బాల రాజు గ్రామానికి చేరుకొని ముత్తవ్వను ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది.
ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ శుక్రవారం గ్రామానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు.