జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, ఆగస్టు 11(విజయక్రాం తి): కంటి చూపు లేకుంటే ప్రపంచమే చీకటి మాయంగా మారుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాలలోని పావని కంటి ఆసుపత్రి, ఆపి, రోటరీ క్లబ్ ఆధర్యంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం నిరహించారు. 17 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం ఉచితం గా కంటి అద్దాలు, మందులను పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్, నాయకులు నాగయ్య, మహే ష్ తదితరులు పాల్గొన్నారు.