calender_icon.png 24 October, 2024 | 4:45 PM

భార్య మృతిచెందిన కొన్నిగంటల్లోనే..

29-08-2024 04:01:05 AM

ఆగిన భర్త గుండె.. నిర్మల్ జిల్లాలో ఘటన

నిర్మల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): భార్య మృతిచెందిన కొన్నిగంటల్లోనే భర్త కూడా మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. తెలిసిన వివరాలప రకారం.. తానూర్ మండలం కేంద్రానికి చెందిన పెంటుబాయి (86), బండెవార్ పోశెట్టి (91) వృద్ధ దంపతులు. మంగళవారం తెల్లవారుజామున పెంటబాయి వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మృతిచెందింది. ఇదే రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులు పెంటుబాయి అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయంలో వృద్ధుడు పోశెట్టి ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. కుటుంబ సభ్యులు బుధవారం పోశెట్టికి అంత్యక్రియలు నిర్వహించారు.