ఇండియా సీఎండీ రాజేశ్ నంబియార్
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి రాజేశ్ సంబియార్ వైదొలిగారు. తదుపరి ఆయన సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 నవంబర్లో ప్రస్తుత నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆమె స్థానంలో నంబియార్ బాధ్యతలు చేపడతారు. ప్రెసిడెంట్ డిజిగ్నేట్గా నంబియార్ నియామకాన్ని బుధవారం నాస్కామ్ ప్రకటించింది. టీసీఎస్, సియనా, కాగ్నిజెంట్ల్లో నంబియార్ గ్లోబల్ టీమ్స్కు నేతృత్వం వహించారు.