- నిరుపేదలకు నిద్ర లేకుండా చేస్తున్నది..
- మాజీ మంత్రి మల్లారెడ్డి
యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు25 (విజయక్రాంతి): హైడ్రా దూకుడు చర్యలతో ప్రజల హైరానా పడుతున్నారని, ప్రజలపై యుద్ధానికి వెళ్తున్నట్లు హైడ్రా వెళ్తున్నదని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. హైడ్రా నిరుపేదల ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నదని ధ్వజమెత్తారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాత కూల్చివేతలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పేదలు బతికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ కొందరు రైతులకు మాత్రమే వర్తించిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో కో లేదని అభిప్రాయపడ్డారు. ఒక్కో మంత్రి ఒక్కో గ్రూప్గా ఉన్నారని, కానీ బీఆర్ఎస్ పాలనలో ఒకటే గ్రూప్, ఒక్కటే పరిపాలన, ఒక్కటే అడ్మినిస్ట్రేషన్ ఉండేదని కొనియాడారు. ప్రభుత్వానికి దమ్ముంటే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులను మించి పనులు చేయాలని సవాల్ విసిరారు.