‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండతో రెచ్చిపోయి రొమాన్స్ చేయ డం ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది షాలినీ పాండే. ఆ సినిమాతో ఫాలోయింగ్ ఊహించనివిధంగా పెరిగిపోయింది. అంతేకాదు, ఇక ‘అర్జున్రెడ్డి లవర్’ స్టార్ హీరోయిన్గా మారిపోవడం పక్కా అనుకున్నారంతా. కానీ, ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. చేసిన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
దీంతో చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ ఖాళీగానే ఉంటోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తున్న ఈ చిన్నదాని గురించి తాజాగా ఓ తీపి కబురు వినిపిస్తోంది. ఎట్టకేలకు షాలినికి ఓ సినిమా ఛాన్స్ వచ్చిందనేది తమిళ సినీ జనాల నుంచి అందుతున్న సమాచారం. కోలీవుడ్ హీరో ధనుష్తో రొమాన్స్ చేయబోతోందని ఫిలిం సర్కిళ్లలో టాక్ నడుస్తోంది.
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇడ్లీ కడై’లో షాలినీ పాండే హీరోయిన్గా ఎంపికయ్యిందని చెప్పుకుంటున్నారు. ఇటీవల సినిమా టైటిల్ను ప్రకటించిన మేకర్స్.. హీరోయిన్ సహా మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలేమీ వెల్లడించలేదు. అందం, అభినయం తక్కువేమీ కాకున్నా.. ఇప్పటిదాకా ఆశించిన స్థాయి లో విజయాలు అందుకోలేకపోయి న షాలిని కెరీర్ ఈ సినిమాతోనైనా మలుపు తిరుగుతుం దేమో చూడాలి.