calender_icon.png 24 October, 2024 | 7:50 AM

బాహుబలి నిర్మాతలతో..

12-07-2024 12:05:00 AM

రానా పూర్తి స్థాయిలో ఓ సినిమా చేసి రెండేళ్లు కావస్తోంది. నటుడిగా, నిర్మాతగా విభిన్న కథలతో ప్రయాణం చేసే ఆయన.. నటుడిగా ఈసారి ఎలాంటి కథతో రానున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో రానా తర్వాతి చిత్రం కోసం ‘బాహుబలి’ నిర్మాతలతో చేయి కలిపినట్టు తెలుస్తోంది. రానా కథానాయకుడిగా ఆర్కా మీడి యా సంస్థలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్నట్టు సమాచారం. కిశోర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందిట. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేశారట చిత్ర నిర్మాతలు. ‘విరాటపర్వం’ తర్వాత రానా దర్శకుడు తేజ సినిమాతో పాటు ఓ చారిత్రక కథతో ఓ భారీ సినిమా చేయనున్నట్టు వార్తలొచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. కాగా ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి ఘన విజయం అందుకున్న ఆర్కా సంస్థతో మరోసారి రానా ఈ సినిమా చేస్తుండటం విశేషం. రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘35 చిన్న కథ కాదు’ ఆగస్టు 15న విడుదల కానుండగా, రజనీకాంత్‌తో ఆయన కలిసి నటించిన ‘వేట్టయాన్’ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.