కిరణ్ అబ్బవరం థియేటర్లలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. గతేడాది మూడు సినిమాలు చేసినా అనుకున్న ఫలితం రాకపోవడంతో ఈసారి గట్టి ప్లాన్తో వస్తున్నాడట ఈ యంగ్ హీరో. ఆయన కథానాయకుడిగా శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ సినిమా నిర్మితమవుతోంది. పీరియాడిక్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని గోపాలకృష్ణ నిర్మిసుండగా, దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు.
తెలియవస్తున్న సమాచారం ప్రకారం రూ. 20 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు యత్నాలు చేస్తున్నారు. సాంకేతిక పరంగానూ ఉన్నతంగా నిలువనున్న ఈ సినిమాకి సామ్ సి.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఓ వైపున ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు సినిమాలని కిరణ్ లైన్లో పెట్టాడట.