ముంబై: శ్రీ నందు నటేకర్ మెమోరియల్ మహారాష్ట్ర స్టేట్ సీనియర్ ఇంటర్ డిస్టిక్ (టీమ్) అండ్ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్లుగా దర్శన్, పూర్వ నిలిచారు. పురుషుల ఫైనల్స్లో దర్శన్ 21-19, 21-19 తేడాతో రిషభ్ దేశ్పాండేను మట్టికరిపించాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో పూర్వ 17-21, 21-7, 21-11 తేడాతో థానేకు చెం దిన ఆర్య మీద విజయం సాధించి చాంపియన్గా నిలిచింది.