calender_icon.png 25 February, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

25-02-2025 06:26:30 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ మంగళవారం ఖానాపూర్ మున్సిపాలిటీ ఇందిరానగర్ కాలనీలో మాజీ కౌన్సిలర్ పరిమి లతా సురేష్ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగులకు, రైతులకు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు.