calender_icon.png 7 April, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇళ్ళందకుంట ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా..

06-04-2025 05:24:26 PM

పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ప్రణవ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): అపర భద్రాద్రిగా పేరొందిన కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇళ్ళందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సీతా రామచంద్రస్వామి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న ప్రణవ బాబుకు ఆలయ అధికారులు ఆదివారం స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని, కళ్యాణ మండపంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. హుజురాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇళ్ళందకుంట ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆలయ కమిటీతో చర్చించి తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, నిధులు కేటాయిస్తామని తెలిపారు.

భక్తులకు ఉచిత మజ్జిక పంపిణీ..

కళ్యాణానికి వచ్చే భక్తులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అన్నదానం గొప్ప కార్యక్రమం..

కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదానం చేయడం పట్ల జమ్మికుంట రైస్ మిల్లర్ల, కాటన్ ఇండస్ట్రీస్, పారబాయిల్డ్ రైస్ మిల్లర్లను ఇతర దాతలను అభినందించారు ప్రణవ్. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు వడ్డించారు.