మంథని ఎస్ఐ రమేష్ జోక్యంతో భర్తకు దహన సంస్కారాలు
మంథని (విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా మంథని మండలంలోని విలోచవరం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం హైదరాబాదులో రోడ్డుప్రమాదంలో మృతి చెందగా, అక్కడ పోస్టుమార్టం అనంతరం దహన సంస్కారాల కోసం మంథని గోదావరి నది తీరానికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. ఇంతలోనే తనకు ఒక కొడుకు ఉన్నాడని తనకు తన భర్త ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ దహన సంస్కారాలు చేయకుండా మృతుని భార్య సంధ్య ఆదివారం అడ్డుకున్నారు.
దాదాపు సంవత్సరం కాలంగా భార్యాభర్తల మధ్య వివాదంతో ఉండడంతో వారు ఇరువురు వేరువేరుగా ఉంటున్నారు. భార్య సంధ్య నిన్నటి నుండి సోమవారం ఉదయం వరకు మంథని గోదావరి నది ఒడ్డునే సురేష్ మృతదేహంతో కుటుంబసభ్యులతో కలిసి అక్కడే ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న మంథని ఎస్ఐ రమేష్ జోక్యం చేసుకొని సురేష్ భార్య సంధ్యతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అనంతరం కుటుంబసభ్యులు సురేష్ మృతదేహానికి దాన సంస్కరాలు చేశారు.