బాన్సువాడ: మామతో కలిసి ఓ మహిళ తను కట్టుకున్న భర్తను హత్య చేసిన దారుణ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిరుమలాపూర్ లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యానికి బానిసైన భర్త రాములు (40) కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. వేధింపులు కాస్త మితిమీరిపోవడంతో మామ నారాయణతో కలిసి భార్య మంజుల భర్తను చంపింది. తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టింది. తన భర్త కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో మామతో కలిసి తానే హత్య చేసినట్లు నేరం ఒప్పుకుంది. నిందితులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. భర్త పెట్టే టార్చర్ భరలించలేకనే ఈ దారుణానికి పాల్పడినట్లు మంజులు పోలీసుల ముందు తెలిపింది.