calender_icon.png 27 October, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరీ ఇంత దారుణమా..! ఫోన్ కోసం భర్తను కట్టేసి కరెంట్ షాక్‌ ఇచ్చిన భార్య

31-05-2024 12:44:03 PM

లక్నో: ఉత్తరప్రదేశ్ మెయిన్ పూరీలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య నిత్యం ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ, ఫోన్‌లోనే ఎక్కువ సేపు గడుపుతోందని అనుమానంతో తన భర్త తన ఫోన్‌ లాక్కున్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళ, రాత్రి అతడిని మత్తుమందు ఇచ్చి, మంచానికి కట్టేసి కొట్టింది. ఆ తర్వాత అతడిని కరెంటు షాక్‌ పెడుతూ చిత్రహింసలకు గురిచేసింది. వారి 14 ఏళ్ల కుమారుడు ఆపేందుకు ప్రయత్నించినప్పుడు అతనిపై కూడా దాడి చేసింది. నిందితురాలిని బేబీ యాదవ్ గా గుర్తించారు.

భర్త ప్రదీప్ సింగ్ యాదవ్ ప్రస్తుతం సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. భర్త తన ఫిర్యాదులో ఇలా పేర్కొన్నాడు. "నా భార్య తన మొబైల్ ఫోన్‌లో రోజూ ఎవరితోనైనా మాట్లాడేది. నేను అభ్యంతరం వ్యక్తం చేసి ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశాను. వారి సలహా మేరకు నేను ఆమె ఫోన్ తీసుకున్నాను, ఇది ఆమెకు కోపం తెప్పించింది. ఆమె నన్ను, నా కొడుకును చంపేస్తానని బెదిరించింది. మే 18 రాత్రి, ఆమె నాకు మత్తుమందు ఇచ్చి క్రూరంగా హింసించింది, నా కొడుకు నన్ను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు అతనిపై కూడా దాడి చేసింది ." అని పేర్కొన్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలిపై ఐపీసీ సెక్షన్లు 307, 328, 506 కింద కేసు నమోదు చేసినట్లు కిష్ని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అనిల్ కుమార్ తెలిపారు.