calender_icon.png 25 September, 2024 | 6:00 PM

భర్తను చంపిన భార్య అరెస్ట్

25-09-2024 12:59:28 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 24: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చం పిన భార్యను పోలీసులు మంగళవారం అరె స్ట్ చేశారు. సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యా పేట మండలం హనుమానాయక్ తండాకు చెందిన ధరవాత్ కౌసల్య అదే తండాకు చెం దిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది.

దీనికి తన భర్త సైదానాయక్ అడ్డువస్తున్నాడనే కారణంతో గత నెల 17న రాత్రి గొడ్డలితో నరకి హత్య చేసింది. ఇది త న చిన్న కొడుకు చూశాడు. ఎవరికీ చెప్పొద్ద ని బతిమాలడటంతో బయటకు రాలేదు. ఈ నెల 22న కౌసల్య చిన్న కొడుకుతో గొడవపడటంతో తన తండ్రిని హత్య చేసిన విషయం తన అన్న సాయికుమార్‌కు చెప్పాడు. ఆయన ఫిర్యాదు మేరకు కౌసల్యను మంగళవారం అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.