calender_icon.png 29 September, 2024 | 7:04 AM

హర్షసాయి ఎక్కడ?

28-09-2024 12:04:55 AM

పరారీలోనే నిందితుడు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 27: యువతిపై లైంగిక దాడికి పాల్పడి, ఆమెను న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి, ఆమె నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని మోసం చేశానడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం నార్సింగి పోలీసులు ముమ్మర గాలిం పు చర్యలు  చేపుడుతున్నారు.

కానీ, నిం దితుడు సోషల్ మీడియాలో మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని, దురుద్దేశంతోనే తనపై యువతి కేసు పెట్టిందని పోస్టులు పెడుతున్నాడు. హర్షసాయి త్వరలోనే తన అడ్వకేట్ పోలీసుల ముందుకు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం.